English | Telugu

అమీర్ ఖాన్ మూవీలో కూడా సన్నీలియోన్ చేస్తోంది..!

సన్నీ లియోన్ కు రెడ్ కార్పెట్ పరిచి మరీ బాలీవుడ్ అవకాశాలు ఇచ్చేస్తోంది. ఆల్రెడీ చాలా అడల్ట్ కంటెంట్ సినిమాల్లో యాక్ట్ చేసేసిన సన్నీ, మెయిన్ స్ట్రీమ్ లో తొలిసారి షారుఖ్ తో రయీస్ లో చిందేసింది. ఇప్పుడు మరో ఖాన్ అమీర్ కూడా, తన సినిమాలో సన్నీకి ఒక ఇచ్చేశాడని బాలీవుడ్ కోడై కూస్తోంది. కుస్తీ పోరాట యోధుడు, అతని కూతుళ్ల కథతో అమీర్ తెరకెక్కిస్తున్న దంగల్ సినిమాలో, సన్నీకి క్యారెక్టర్ తో పాటు, ఒక మస్తీ సాంగ్ ఉండే అవకాశం ఉందంటున్నారు బాలీవుడ్ జనాలు.

ఈ వార్త నిజమైతే, ఇక బాలీవుడ్ ఖాన్ త్రయంలో సన్నీతో చేయడానికి సల్మాన్ మాత్రమే మిగిలాడు. సల్మాన్ నా ఫేవరెట్ హీరో అని సన్నీ బాలీవుడ్ కు వచ్చిన కొత్తలోనే చెప్పేసింది. సల్లూ భాయ్ కూడా అమ్మడికి అవకాశం ఇచ్చాడంటే, ఇక అడల్ట్ కంటెంట్ వదిలేసి, మిగతా హీరోయిన్లలా మామూలు సినిమాల్లో సన్నీ యాక్ట్ చేసేయచ్చు.ఇప్పటికీ ఆమె గతం బట్టే పాత్రలు ఇస్తున్నారు తప్ప, యాక్టింగ్ కు స్కోప్ ఉన్న పాత్రలు సన్నీలియోన్ కు రావట్లేదు. త్వరలో రిలీజ్ అవుతున్న వన్ నైట్ స్టాండ్ కూడా అలాంటిదే. ఆమెకు కూడా ఈ పాత్రలు చేసీ చేసీ విసుగొచ్చిందట. తన ఐటెం సాంగ్స్ పట్ల జనం బోర్ ఫీలయ్యే లోపే, యాక్టింగ్ కు స్కోప్ ఉన్న క్యారెక్టర్ల వైపు షిఫ్ట్ అవ్వాలనేది సన్నీ ప్లాన్. మరి బాలీవుడ్ ఆమెకు అలాంటి అవకాశం ఇస్తుందో లేదో చూడాలి. ఏదేమైనా, గతం గత: అన్న సూక్తికి సన్నీ లియోన్ కరెక్ట్ గా సూటవుతుందనడంలో మాత్రం ఆశ్చర్యం లేదు..!

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.