English | Telugu

ఇలియానాకు యాభై లక్షలు ఇస్తే చాలంట..!

కొద్దిగా రివైండ్ వేసుకుని ఒక ఐదేళ్లు వెనక్కి వెళ్తే, సౌత్ లో టాప్ మోస్ట్ హీరోయిన్లలో ఒకరిగా ఇలియానాకు పేరుండేది. ఈ నడుము భామకు టాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయిపోవడంతో, వరస సినిమాలతో, కోటి రూపాయలు తీసుకున్న అగ్రతారగా వెలుగొందింది. కానీ పరిస్థితులు ఒకేలా ఉండవు కదా..! పరిస్ధితులు, ఆలోచనలు మారుతూనే ఉంటాయి. ఇల్లీ భామకు కూడా అలాంటి ఆలోచనే ఒకటి వచ్చింది. ఇక్కడే మనల్ని ఇలా చూసుకుంటున్నారంటే, బాలీవుడ్ లో ఇంకెలా చూసుకుంటారో అన్న థాట్ తో, అర్జెంట్ గా బాలీవుడ్ లో మకాం వేసేసి టాప్ అయిపోదాం అని ప్లాన్ వేసింది. కానీ పాపం ఇల్లీ బేబీని బాలీవుడ్ చాలా సింపుల్ గా రిజక్ట్ చేసేసింది.

స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ సరసన బర్ఫీ చేసినా మేడంగారికి కలిసి రాలేదు. ఆ తర్వాత కూడా అరా కొరా సినిమాలు చేసింది. అన్నీ ఢాం అన్నాయి. దాంతో అక్షయ్ కుమార్ రుస్తోం సినిమా మీదే పూర్తి ఆశలు పెట్టుకుంది. ఆ సినిమా కూడా ఇల్లికి పెద్దగా ప్లస్ అయ్యే అవకాశాల్లేవు. ఎందుకంటే, ఆ సినిమా అంతా పూర్తిగా అక్షయ్ భుజాల మీదే నడుస్తుంది. అందుకే ఇప్పుడు ఇలియానా మళ్లీ సౌత్ కు రావాలని ప్లాన్ వేస్తోందట. కేవలం 50 లక్షలకే మూవీ చేస్తానంటూ ఇక్కడి నిర్మాతలకు సిగ్నల్స్ పంపుతోందని టాలీవుడ్ టాక్. అప్పటి తన తోటి హీరోయిన్లందరూ ఇప్పుడు కోట్లు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో, ఇల్లీ మాత్రం కేవలం 50 లక్షలకే సినిమా చేస్తే మళ్లీ ఒకటో రెండో సౌత్ అవకాశాలు తలుపుతట్టే అవకాశం లేకపోలేదు. కానీ హిందీకెళ్లిన తర్వాత టాలీవుడ్ ను విమర్శించిన ఇలియానాను ఇక్కడ ఎవరు తీసుకుంటారు అనేది ఆసక్తికరం.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.