English | Telugu
2024లో ధనుష్ తేరే ఇష్క్ మే!
Updated : Jun 22, 2023
రాంజానా సినిమా గుర్తుందిగా. సరిగ్గా దశాబ్దం క్రితం ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో విడుదలైంది. 2013 జూన్ 21న ధనుష్ని బాలీవుడ్కి పరిచయం చేసింది. ధనుష్, సోనమ్ కపూర్ నటించిన ఆ మూవీకి ఇప్పటికీ ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సినిమాతో స్టార్ట్ అయిన ధనుష్, ఆనంద్ పరిచయం 2021లో అత్రంగి రే లోనూ కంటిన్యూ అయింది. ఇప్పుడు మళ్లీ ఈ హిట్ కాంబో సిల్వర్ స్క్రీన్ మీద మ్యాజిక్ చేయడానికి రెడీ అయింది.
వచ్చే ఏడాది స్టార్టింగ్లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది. ఈ విషయాన్ని ఆనంద్ ఎల్ రాయ్ ప్రకటించారు. తేరే ఇష్క్ మే అంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు. ధనుష్ చేతిలో మండుతున్న బాటిల్ పట్టుకుని పరిగెత్తుకుంటూ వెళ్లి విసిరేస్తారు. అక్కడ రాంజానా వరల్డ్ నుంచి వస్తున్న తేరే ఇష్క్ మే అనే టైటిల్ రివీల్ అయింది. వీడియో చూసిన వారందరూ చాలాబాగా చేశారని మెచ్చుకుంటున్నారు.
కొన్ని బంధాలు ఎప్పటికీ పాతబడవు అని హింట్ ఇస్తూ, తేరే ఇష్క్ మే ప్రాజెక్ట్ గురించి ఎగ్జయిట్ అయ్యారు డైరక్టర్ ఆనంద్. ``మా నెక్స్ట్ వెంచర్ని అనౌన్స్ చేయడానికి ఇంతకన్నా మంచి తరుణం ఎక్కడ ఉంటుంది? ధనుష్, రాంజానా నా గుండెలో ఎప్పటికీ బెస్ట్ ప్లేస్ కలిగి ఉన్న అంశాలు. రాంజానాతో ధనుష్ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. తనకున్న టాలెంట్తో మాసివ్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు. హిందీ, సౌత్ సరిహద్దులు చెరిగిపోతున్న వేళ మేం ప్యాన్ ఇండియా సినిమాను తెరకెక్కించబోతున్నాం`` అని అనౌన్స్ చేశారు. రా ఎమోషన్స్, మెలోడియస్ మ్యూజిక్, బెస్ట్ స్టోరీతో ఈ సినిమా ఉంటుందని హింట్ ఇస్తోంది యూనిట్. ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. 2024లో విడుదలవుతుందని ప్రకటించారు. ఈ మూవీలోనూ ధనుష్ పెరిగిన గడ్డం, జుట్టుతో మాస్గా కనిపిస్తున్నారు.
