English | Telugu

"తను వెడ్స్ మను" లో సాయిరాం, ఛార్మి

సాయిరాం, ఛార్మి కలసి ఒక తెలుగులోకి రీమేక్ చేయబోతున్న చిత్రంలో నటించటానికి సిద్ధపడుతున్నారు. కంగనా రనౌత్ ‍, మాధవన్ కలసి నటించగా బాలీవుడ్ లో ఇటీవల విడుదలైన "తను వెడ్స్ మను" అనే చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ రీమేక్ చిత్రంలో హీరోగా సాయిరాం శంకర్, హీరోయిన్ గా ఛార్మి నటించబోతున్నారు. ఈ చిత్రం యొక్క తెలుగు రీమేక్ హక్కులను నల్లమలపు శ్రీనివాస్ (బుజ్జి) సొంతం చేసుకున్నారు.

చిత్రాన్ని నల్లమలపు బుజ్జి, దిల్ రాజు కలసి నిర్మిస్తారట. ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ శిష్యుడు గోపి దర్శకత్వం వహిస్తాడని తెలిసింది. ఛార్మి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న హిందీ చిత్రంలో నటిస్తుంది. ఆ కారణంగానే పురీ జగన్నాథ్ తమ్ముడు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించేందుకు అంగీకరించింది.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం