English | Telugu

ప‌వ‌న్ దెబ్బ‌కి.. మ‌న ప‌రువు గోవిందా!


బాహుబ‌లి ఇచ్చిన స్ఫూర్తో, లేదంటే బాహుబ‌లి రికార్డు బ‌ద్ద‌లు కొట్టేయాల‌న్న అత్యాసో.. లేదంటే త‌న టాలెంట్‌ని బాలీవుడ్ జ‌నాల‌కు కూడా రుచి చూపించాల‌న్న క‌సో తెలీదుగానీ.. స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాని హిందీలో డ‌బ్ చేసి మ‌రీ రిలీజ్ చేశారు. రూ.12 కోట్ల‌కు ఈరోస్ సంస్థ ఈ సినిమా డ‌బ్బింగ్ రైట్స్‌ని కొనేసిందని, ఏకంగా ఎనిమిది వంద‌ల థియేట‌ర్ల‌లో భారీగా రిలీజ్ చేస్తున్నామ‌ని ఆర్భాటాల‌కు పోయారు స‌ర్దార్ ద‌ర్శ‌క నిర్మాత‌లు. ప‌వ‌న్ ని బాలీవుడ్‌లో ఎవ‌రు చూస్తారు?? స‌ర్దార్‌కి అంత సీన్ ఉందా? అనే అనుమానాలు టాలీవుడ్ లో వ్య‌క్తం అయ్యాయి. బాలీవుడ్ వాసులూ... స‌ర్దార్‌ని లైట్ తీసుకొన్నారు. క‌మాల్ ఖాన్ లాంటోళ్లు ఈ సినిమాపై సెటైర్లు వేశారు. ప‌ట్టుమ‌ని ప‌ది మంది థియేట‌ర్ల‌కు వ‌చ్చినా నేను తెలుగు రాష్ట్ర్రాల‌లో న‌గ్నంగా తిరుగుతా అని శ‌ప‌థం చేశాడాయ‌న‌. రాంగోపాల్ వ‌ర్మ‌కీ, క‌మాల్ ఖాన్‌కీ ట్విట్ట‌ర్‌లో మాటల యుద్ద‌మే సాగింది. ఇప్పుడు క‌మాల్ ఖాన్ మాటే నిజం అయ్యేట్టు ఉంది.

స‌ర్దార్ బెనిఫిట్ షోకే టాలీవుడ్‌లో ఫ్లాప్ టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. ఇక బాలీవుడ్ ప‌రిస్థితి ఏమిటో, అక్క‌డి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవొచ్చు. ఈ సినిమా బాలీవుడ్‌లో క‌నీసం కోటి రూపాయ‌లు వ‌సూలు చేసినా గొప్పే అని ఇప్పుడు ట్రేడ్ విశ్లేష‌కులు తేల్చి చెప్పేస్తున్నారు. అంటే... స‌ర్దార్‌కి బాలీవుడ్లో భారీ ప‌రాభ‌వం త‌ప్ప‌ద‌న్న‌మాట‌. బాహుబ‌లి పుణ్య‌మా అని ద‌క్షిణాది చిత్రాల‌కు ఇప్పుడిప్పుడే హిందీలో కాస్తో కూస్తో గౌర‌వం ద‌క్కుతున్న స‌మ‌యంలో.. స‌ర్దార్ ప‌రాభ‌వంతో మ‌రో నాలుగు అడుగులు వెన‌క్కి ప‌డినా ఆశ్చ‌ర్యం లేదు. క‌మాల్ ఖాన్‌.. నువ్వు గెలిచావ‌య్యా... సారీ మా స‌ర్దార్ ఓడిపోయాడు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.