English | Telugu

ఉగాది కానుకగా బ్రహ్మోత్సవం పోస్టర్

సూపర్‌స్టార్ మహేశ్-శ్రీకాంత్ అడ్డాల కాంభినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా బ్రహ్మోత్సవం. ఇప్పటికే సినిమాకి సంబంధించిన ఫస్ట్‌లుక్ రిలీజైంది. ఉగాది కానుకగా ప్రేక్షకులకి శుభాకాంక్షలు చెబుతూ బ్రహ్మోత్సవం టీమ్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. సూపర్ స్టార్ మహేశ్ బాబు సోషల్ మీడియా ద్వారా ఈ ఫోటోను అభిమానులతో పంచుకున్నాడు. ఈ పోస్టర్‌లో వైట్ కలర్‌ సూటు వేసుకున్న మహేశ్ ఎవరికో చెప్పులు తొడుగుతున్నట్టుగా ఉంది. దీంతో సూపర్‌స్టార్‌తో చెప్పులు తొడిగించుకేనే ఆ గొప్ప వ్యక్తి ఎవరబ్బా అని ప్రిన్స్ అభిమానులతో పాటు సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో మ‌హేష్ స‌ర‌స‌న స‌మంత‌, కాజ‌ల్‌, ప్రణీత‌లు హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. స‌త్య‌రాజ్‌, జ‌య‌సుధ‌, రేవ‌తి, న‌రేష్, తుల‌సి త‌దిత‌రులు ముఖ్య‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. మిక్కీ జే.మేయ‌ర్ ఈ చిత్రానికి సంగీతం స‌మ‌కూరుస్తుండ‌గా, మ‌ణిశ‌ర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ‘బ్ర‌హ్మోత్స‌వం’ చిత్రాన్ని ప్ర‌సాద్ వి.పొట్లూరితో క‌లిసి మ‌హేష్‌బాబు నిర్మిస్తున్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.