English | Telugu

పవర్ తగ్గిన పవన్ వన్ మ్యాన్ షో

స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్‌ క‌థ విష‌యంలో వ‌వ‌న్ ప్ర‌యోగాల‌కు పోలేదు. కొత్తద‌నం జోలికి వెళ్ల‌లేదు. ఫార్ములాకు త‌గ్గ‌ట్టుగానే క‌థ‌ని న‌డిపి.. త‌న అభిమానుల్ని అనుక్ష‌ణం సంతృప్తి ప‌ర‌చ‌డానికి ప్ర‌య‌త్నించాడు. ప‌వ‌న్ ఎనర్జీ, అత‌ని క్యారెక్ట‌రైజేష‌న్ స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్‌ కి వెన్నెముక‌. ఒక ముక్క‌లో చెప్పాలంటే ఇది ప‌వ‌న్ వ‌న్ మ్యాన్ షో. ప‌వ‌న్ లేక‌పోతే ఈ సినిమా లేదు. ఈ సినిమా తొలి స‌న్నివేశం నుంచీ ప‌వ‌న్ మోటీవ్ అదే. ప‌వ‌న్ ఇంట్ర‌డ‌క్ష‌న్ ఫైట్‌, అక్క‌డ చెప్పిన డైలాగులు, ఆ త‌ర‌వాత వ‌చ్చే పాట‌.. ఇవ‌న్నీ అభిమానుల‌కు న‌చ్చుతాయి. ప‌వ‌న్ కామెడీ టైమింగ్‌తో.. త‌న ఎన‌ర్జీతో ఫ‌స్టాఫ్ అంతా లాగించేశాడు. ఇంట్ర‌వెల్ ముందొచ్చే...ఫైట్ అభిమానుల‌కు పండ‌గే. ఆడెవ‌డ‌న్నా.. ఈడెవ‌డ‌న్నా.. స‌ర్దార్ అన్న‌కు ఎదురెవ‌డ‌న్నా.. అనే పాట‌తో.. ఓ ఫైట్ కంపోజ్ చేసి.. ఫ‌స్టాఫ్‌కి గ్రాండ్ గా ముగింపు ఇచ్చాడు. సెకండాఫ్‌లో విల‌న్‌ని ఎదుర్కోవ‌డం, హీరోయిన్‌ని దక్కించుకోవ‌డం.. శుభం కార్డు ప‌డిపోవ‌డం.. ఇదంతా రొటీనే. అయితే.. మ‌ధ్య‌మ‌ధ్య‌లో వ‌వ‌న్ శైలి చ‌మ‌క్కులు, డైలాగులు, చిరంజీవి వీణ స్టెప్పు.. ఇవ‌న్నీ క‌ల‌గ‌లిపి కాల‌క్షేపం అందిస్తాయి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.