English | Telugu

ప్రభాస్ పెళ్లి...రానా ఓపెన్ ఆఫర్

రాజకుమారుడు, ఆరు అడుగుల రెండంగుళాల అందగాడు, అవసరమైతే ఇంట్లో పనులకు సాయపడతాడు, అమ్మాయి కోసం కొండలెక్కుతాడు...మేకప్ కూడా చేస్తాడు..ఏంటి ఇదంతా అనుకుంటున్నారా...వాంటెడ్ బ్రైడ్ ఫర్ బాహుబలి అంటూ ట్విట్టర్ లో రానా ఇచ్చిన ప్రకటన ఇది.. ప్రభాస్ రానాలిద్దరికీ మధ్య చాలా చనువుంది..బావా బావా అని పిలుచుకునేంత క్లోజ్ వీళ్లిద్దరూ. అందుకేనేమో, ట్విట్టర్లో ప్రభాస్ ను సరదాగా ఆటపట్టించాడు రానా...36 ఏళ్ల మా అందగాడికి వధువు కావలెను అంటూ ప్రకటన ఇచ్చాడు..

వధువుకు ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలో కూడా ముందే చెప్పాడు..అమ్మాయికి అందంతో పాటు, అడవుల్లో, మంచు తుఫాన్లో కూడా ప్రయాణించడం తెలిసుండాలి.. కత్తి యుద్ధం, మల్లయుద్ధం తెలిసుండాలట..ఇప్పటికే చాలా ఏళ్లు కారాగారంలో ఉన్న అత్తగారిని బాగా గౌరవించాలట..ఇంటిపనిలోనూ,శత్రువుల్ని ఓడించడంలోనూ భర్తకు సాయపడాలట...ఫైనల్ పంచ్ గా క్వాలిఫికేషన్స్ ఉన్న అమ్మాయిలు, అడ్మిన్ కట్టప్పకు గానీ, శివగామికి గానీ తమ డిటెయిల్స్ మెయిల్ చేయాలని మెయిల్ ఐడీలు ఇచ్చాడు..ప్రభాస్ కావాలనుకునే అమ్మాయిలందరూ ఇప్పుడు ఇన్ని విద్యలు నేర్చుకోవాలేమో...

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.