English | Telugu

ల‌క్కీ మంత్ లో రానున్న నాగ్!

ఈ ఏడాది సంక్రాంతికి `బంగార్రాజు`గా ప‌ల‌క‌రించిన సీనియ‌ర్ స్టార్ కింగ్ నాగార్జున‌.. ప్ర‌స్తుతం యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ గా రూపొందుతున్న‌ `ద ఘోస్ట్`తో బిజీగా ఉన్నారు. ఇందులో నాగ్ కి జోడీగా హాట్ బ్యూటీ సోనాల్ చౌహాన్ న‌టిస్తుండ‌గా.. `గ‌రుడ‌వేగ‌` ఫేమ్ ప్ర‌వీణ్ సత్తారు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. కాగా, శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న ఈ సినిమాని నాగ్ ల‌క్కీ మంత్స్ లో ఒక‌టైన అక్టోబ‌ర్ లో రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయ‌ట‌.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. గ‌తంలో ఇదే అక్టోబ‌ర్ మాసంలో నాగ్ కెరీర్ ని మేలిమ‌లుపు తిప్పిన `శివ‌` (1989)తో పాటు అప్ప‌టి టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒక‌టైన `నిన్నే పెళ్ళాడ‌తా` (1996) కూడా రిలీజైంది. అలాగే `ప్రెసిడెంటు గారి పెళ్ళాం` (1992), `అల్ల‌రి అల్లుడు` (1993) వంటి మాస్ ఎంట‌ర్టైన‌ర్స్ కూడా ఇదే నెల‌లో విడుద‌లై క‌మ‌ర్షియ‌ల్ హిట్స్ గా నిలిచాయి. అంతేకాదు.. నాగ్ ని స్టైలిష్ గా ప్రెజెంట్ చేసిన `శివ‌మ‌ణి` (2003) లాంటి కాప్ డ్రామా కూడా ఇదే నెల‌లో ఎంట‌ర్టైన్ చేసింది. మ‌రి.. నాగ్ కి ప‌లు మెమ‌ర‌బుల్ హిట్స్ ని అందించిన అక్టోబ‌ర్ నెల‌ని టార్గెట్ చేసుకున్న `ద ఘోస్ట్` కూడా అదే బాట‌లో ప‌య‌నిస్తుందేమో చూడాలి. కాగా, త్వ‌ర‌లోనే `ద ఘోస్ట్` రిలీజ్ డేట్ పై క్లారిటీ రానున్న‌ది.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.