English | Telugu

మ‌రోసారి.. మెగాస్టార్ వ‌ర్సెస్ న‌ట‌సింహం!

మెగాస్టార్ చిరంజీవి, న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణకి బాక్సాఫీస్ క్లాష్ కొత్తేమీ కాదు. ఇప్ప‌టికే ఈ ఇద్ద‌రు ప‌లుమార్లు బాక్సాఫీస్ బ‌రిలో పోటీప‌డ్డారు. చివ‌రిసారిగా 2017 సంక్రాంతి సీజ‌న్ లో చిరంజీవి త‌న 150వ చిత్రం `ఖైదీ నంబ‌ర్ 150`తో సంద‌డి చేస్తే.. బాల‌య్య త‌న 100వ సినిమా `గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి`తో ప‌ల‌క‌రించారు. ఇద్ద‌రు కూడా ఈ ర‌స‌వ‌త్త‌ర పోటీలో విజ‌యాలు చూశారు. క‌ట్ చేస్తే.. ఐదేళ్ళ అనంత‌రం ఈ ఇద్ద‌రు సీనియ‌ర్ స్టార్స్ మ‌రోమారు పోటీకి సిద్ధ‌మ‌వుతున్నార‌ట‌.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. చిరంజీవి క‌థానాయ‌కుడిగా `గాడ్ ఫాద‌ర్` పేరుతో ఓ సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. మాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ `లూసీఫ‌ర్`కి రీమేక్ వెర్ష‌న్ గా త‌యార‌వుతున్న ఈ పొలిటిక‌ల్ డ్రామాని `హ‌నుమాన్ జంక్ష‌న్` ఫేమ్ మోహ‌న్ రాజా డైరెక్ట్ చేస్తున్నారు. చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకున్న ఈ భారీ బ‌డ్జెట్ మూవీని ద‌స‌రా సీజ‌న్ లో రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు వినిపిస్తోంది. మ‌రోవైపు బాల‌య్య - `క్రాక్` కెప్టెన్ గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్ లో వ‌స్తున్న సినిమా కూడా విజ‌య ద‌శ‌మి ల‌క్ష్యంగా నిర్మాణం జ‌రుపుకుంటోంద‌ని స‌మాచారం. సో.. 2022 ద‌స‌రా బ‌రిలో చిరంజీవి వ‌ర్సెస్ బాల‌య్య కి స్కోప్ ఉన్న‌ట్లే అన్న‌మాట‌. మ‌రి.. ఈ సారి కూడా ఈ ఇద్ద‌రు టాప్ స్టార్స్ స‌క్సెస్ అందుకుంటారేమో చూడాలి.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.