English | Telugu

రుద్ర‌మ‌దేవి - టేబుల్ లాస్‌??

బాహుబ‌లి కోసం రాజ‌మౌళి ఎన్ని క‌ల‌లు క‌న్నాడో... రుద్ర‌మ‌దేవి కోసం గుణ‌శేఖ‌ర్ కూడా అన్నే క‌ల‌లు క‌న్నాడు. బాహుబ‌లి - రుద్ర‌మ‌దేవి... రెండూ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రాలే. అయితే... బాహుబ‌లికి వ‌చ్చిన క్రేజ్‌లో ప‌ది శాతం కూడా రుద్ర‌మ‌దేవికి రాలేదు. రాజ‌మౌళి త‌న మాస్ట‌ర్ ప్లాన్‌తో ఈ సినిమాకి పైసా ఖ‌ర్చు పెట్ట‌కుండా బీభ‌త్స‌మైన ప‌బ్లిసిటీ చేసి - విప‌రీత‌మూన హైప్ క్రియేట్ చేయ‌గ‌లిగాడు. అయితే గుణ‌శేఖ‌ర్ మాత్రం ఈ విష‌యంలో క్రియేటీవ్ గా ఆలోచించ‌లేక‌పోయాడు.

రుద్ర‌మ‌దేవి తొలి ట్రైల‌ర్ కూడా ఏమాత్రం ఆక‌ట్టుకోలేక‌పోయింది. దాంతో రుద్ర‌మ‌దేవి వైపు బ‌య్య‌ర్లు తొంగి చూడ‌లేదు. బాహుబ‌లి కంటే ముందే రుద్ర‌మ‌దేవిని విడుద‌ల చేయాల‌నుకొన్నాడు గుణ‌. కానీ.. అదీ సాధ్యం కాలేదు. ఇప్ప‌డు బాహుబ‌లి వ‌చ్చేసింది. రుద్ర‌మ‌దేవికి విముక్తి క‌ల‌గ‌డానికి ఇదే స‌రైన స‌మ‌యం. అందుకే ఆగ‌మేఘాల‌మీద రుద్ర‌మ‌దేవిని బ‌య‌ట‌కు తీసుకొద్దామ‌నుకొంటున్నాడు గుణ. ఈ సినిమాకి ఇప్ప‌టి వ‌ర‌కూ రూ.65 కోట్ల బ‌డ్జెట్ అయ్యింద‌ని టాక్‌. ఏ సినిమా అయినా నిర్మాత టేబుల్ ప్రాఫిట్‌తో అమ్ముకోవాల‌ని చూస్తాడు. కానీ ఈ సినిమా మాత్రం గుణ‌శేఖ‌ర్ క‌నీసం రూ.20 కోట్ల డేబుల్ లాస్‌తో రిలీజ్ చేస్తున్నాడ‌ట‌.

ఇప్ప‌టికైనా ఈ సినిమాని విడుద‌ల చేస్తే అదే ప‌ది వేలు అనుకొంటున్నాడ‌ట‌. పెరిగిపోతున్న వడ్డీలు, ఒత్తిడి నుంచి ఉప‌శ‌మ‌నం పొందాలంటే.. ఈ సినిమాని రూ.20 కోట్ల న‌ష్టంతో రిలీజ్ చేయ‌డం కంటే మ‌రో మార్గం లేద‌ని భావిస్తున్నాడు గుణ‌శేఖ‌ర్‌. ఈనెల చివ‌రి వారంలోగానీ, ఆగ‌స్టు తొలి వారంలోగానీ రుద్ర‌మ‌దేవి వ‌చ్చేసే ఛాన్స్ ఉంద‌ని టాక్‌. గుణ‌శేఖ‌ర్ క‌ల‌ల చిత్రం.. క‌నీవినీ ఎరుగ‌ని విజ‌యం సాధించి గుణ శేఖ‌ర్‌కి ఉప‌శ‌మ‌నం తీసుకురావాల‌ని కోరుకొందాం.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.