English | Telugu

ప్ర‌భాస్‌.. రూ.150 కోట్లు కొట్టేస్తాడా??

తెలుగు సినిమా మార్కెట్ ఎంతో చాటి చెప్పిన ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి. మ‌గ‌ధీర సినిమాతో బాలీవుడ్ కూడా ఆశ్చ‌ర్య‌పోయింది. ఓ ప్రాంతీయ చిత్రం రూ.100 కోట్ల ద‌రిదాపుల్లోకి రావ‌డం.. విస్మ‌యప‌రిచింది. ఆ న‌మ్మ‌కంతోనే బాహుబ‌లికి రూ.250 కోట్ల‌కుపైనే ఖర్చు పెట్టేశాడు జ‌క్క‌న్న‌. బాహుబ‌లి బ‌డ్జెట్ రెండొంద‌ల యాభై కోట్లు అన‌గానే... మ‌ళ్లీ జ‌నాల‌కు షాక్ తగిలింది. తెలుగు సినిమా స్టామినా ఇప్ప‌టి వ‌ర‌కూ వంద కోట్లే. ఎంత రెండు భాగాలు గా తెర‌కెక్కించినా బాహుబ‌లి సేఫ్ జోన్‌లోకి వెళ్ల‌డం క‌ష్ట‌మ‌నుకొన్నారంతా! అయితే ఆ లెక్క‌ల్ని బాహుబ‌లి ప‌టాపంచ‌లు చేసింది.

తొలి మూడు రోజుల్లోనే రూ.80 కోట్ల వ‌ర‌కూ షేర్ సాధించి.... త‌న స‌త్తా చాటింది. ఈ రోజు మ‌రో నాలుగు రోజులు కొన‌సాగితే.... వంద కోట్ల‌మైలు రాయిని అందుకోవ‌డం త‌థ్యం. వంద స‌రే.. ఇంత‌కీ బాహుబ‌లి పార్ట్ 1 టార్గెట్ ఎంత‌? ఈ సినిమా ఎంత వ‌సూలు చేయ‌గ‌ల‌దు? అనే లెక్క‌లు వేస్తే.. అన్నీ అనుకూలిస్తే.. ఈ జోరు కొన్ని రోజులు ఇలానే కొన‌సాగితే... ఖ‌చ్చితంగా రూ.150 కోట్లు ద‌క్కించుకోవ‌డం ఖాయ‌మ‌ని ట్రేడ్ వ‌ర్గాలు విశ్లేషిస్తున్నాయి.

బాలీవుడ్‌లో బాహుబలి అడుగుపెట్ట‌డం, ప్ర‌పంచ వ్యాప్తంగా 4000 థియేట‌ర్ల‌లో బాహుబ‌లి ప్ర‌ద‌ర్శితం కావ‌డంతో... ఈస్థాయి వ‌సూళ్లు ద‌క్కించుకొనే అవ‌కాశం ఉంద‌ని విశ్లేష‌కులు తేల్చి చెబుతున్నారు. అదే నిజ‌మైతే రాజ‌మౌళి అనుకొన్న‌ది సాధించిన‌ట్టే. టాక్ ఎలా ఉన్నా..టేకింగ్ మామూలుగానే ఉన్నా.. వ‌సూళ్లు మాత్రం ఇర‌గ‌దీస్తుండ‌డంతో బాహుబ‌లి టీమ్ ఫుల్ హ్యాపీగా ఉంది. బాహుబ‌లి రూ.150 కోట్లు దాటితే... టాలీవుడ్ కూడా హ్యాపీనే. ఆల్ ది బెస్ట్‌.. బాహుబ‌లి.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.