English | Telugu

బాహుబలి రైట్స్ కావాలంటున్న రామోజీరావు

బాహుబ‌లి శాటిలైట్ హ‌క్కులు ఈటీవీకి ద‌క్క‌బోతున్నాయా?? ఈసినిమా కావాల‌ని స్వ‌యంగా రామోజీరావే ప‌ట్టుప‌డుతున్నారా?? అవున‌నే అంటున్నాయి టాలీవుడ్ వ‌ర్గాలు. బాహుబ‌లికి వెన్నంటి ఉండి, ఆర్థికంగా త‌న స‌హాయ స‌హ‌కారాలు అందించారు రామోజీరావు. ఈ సినిమాలో ఎక్కువ భాగం రామోజీ ఫిల్మ్‌సిటీలోనే చిత్రీక‌రణ జ‌రిగింది. దాంతో రాజ‌మౌళి కూడా రామోజీకి ఫేవ‌ర్ చేయాలనుకొంటున్నాడ‌ని టాక్‌.

బాహుబ‌లి శాటిలైట్ రైట్స్ కోసం జెమిని, మాటీవీ తీవ్రంగా పోటీ ప‌డుతున్నా... ఈవీటీకే క‌ట్టాబెట్టాల‌ని జ‌క్క‌న్న భావిస్తున్నాడ‌ట‌. బ‌య‌ట ఈ సినిమా కోసం రూ.15 కోట్లు వెచ్చించ‌డానికి రెడీ అంటున్నా... అంత‌కంటే త‌క్కువ‌కే ఈటీవీ చేతిలో పెట్టాల‌ని రాజ‌మౌళి నిర్ణ‌యానికి వ‌చ్చాడ‌ట‌. ఈటీవీ ఇప్ప‌టి వ‌ర‌కూ ఇంత పెద్ద మొత్తంలో ఓ సినిమా శాటిలైట్ హ‌క్కుల్ని కొన్న‌ది లేదు. అయితే బాహుబ‌లి విష‌యంలో మాత్రం ఆ ధైర్యం చూపిస్తోంది. బాహుబ‌లిని ఈటీవీ సొంతం చేసుకొంటుందా, కొంటే.. ఎన్ని కోట్లు వెచ్చించ‌బోతోంది? అనే విష‌యాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.