English | Telugu
మరో కొత్త వైరస్ వచ్చిపడింది!
Updated : Mar 10, 2020
అంతు చిక్కని ఈ వైరస్ కోళ్ల నుంచి గబ్బిలాలకు వస్తుందట. అసలే కరోనా భయంతో బిక్కబిక్కుమంటూ ప్రజలకు ఇది షాక్కు గురిచేస్తోంది. ఇటీవలి కాలంలో అంతుచిక్కని వైరస్ ప్రభలడంతో ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాతపడ్డాయి. అంతుచిక్కని వైరస్ వల్ల ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి నియోజకవర్గంలోనే లక్షకు పైగా కోళ్లు చనిపోవడం అప్పట్లో సంచలనంగా మారింది. చిక్ సీడ్ తయారు చేస్తున్న కంపెనీల ప్రతినిధులు విజయవాడ , హైదరాబాద్ లోని ల్యాబ్ లకు తీసుకువెళ్లి టెస్టులు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. వైరస్ ను అరికట్టే వాక్సిన్ ను కనిపెట్టలేక పోతున్నారు. వైరస్ తో చనిపోయిన కోళ్ల ను కాల్చివేసి పూడ్చాలని పశువైద్య అధికారులు ఫారాల నిర్వాహకులకు సూచించి చేతులు దులుపుకున్నారు.
ఇప్పుడు అలాంటి పరిస్థితులే కేరళలో నెలకున్నాయి. అయితే అక్కడ కోళ్లు మాత్రమే కాదు గబ్బిళాలు కూడా చనిపోవడం ప్రజలను కలవరపెడుతోంది. కేరళలోని కొజిక్కొడె జిల్లాలో జరిగిన ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే జంతు సంబంధిత అధికారులకు సమాచారం అందించడంతో, వారు వచ్చి చనిపోయిన గబ్బిళాల నుంచి శాంపిల్స్ సేకరించారు.
పరీక్షల కోసం చనిపోయిన గబ్బిలాల నుండి నమూనాలను సేకరించారు. చనిపోయినవాటిన్నింటిని కాల్చి బూడిద చేశారు. పరీక్ష ఫలితాలకు కొన్ని రోజులు సమయం పడుతుంది 'అని జిల్లా పశుసంవర్ధక అధికారి డిఆర్ కెవి ఉమా అన్నారు.
కొజిక్కెడ్ జిల్లాలో రెండు పౌల్ట్రీ ఫామ్స్లో బర్డ్ ఫ్లూ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కోళ్లు వందల సంఖ్యలో చనిపోవడంతో టెస్టులు చేసిన అధికారులు.. Type-A Influenzaకు సంబంధించిన H5, H7 వైరస్ అందుకు కారణంగా నిర్ధారించారు. దీంతో వెంటనే అలర్టయిన రాపిడ్ రెస్పాన్స్ టీమ్, ఆ కోళ్ల ఫామ్స్కు ఒక కిలోమీటర్ పరిధిలో సంచరిస్తోన్న 1200వరకు రకరకాల పక్షుల నమూనాలను సేకరించారు. ఆ కోళ్ల ఫారం నుంచే వైరస్ గబ్బిలాలకు సోకిందని ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. ముందు జాగ్రత్తగా ఆ ప్రాంతానికి 10కిలోమీటర్ల దూరం వరకూ షాపుల్లో కోళ్లను, గుడ్లను అమ్మకాలను నిషేదించారు. నష్టపోయినవారిని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుంటుందని అధికారులు హామి ఇచ్చారు.