English | Telugu

పాక్ లో భారత్‌కు చెందిన ఇద్దరు అధికారులు మిస్సింగ్

పాకిస్థాన్‌లో ఇండియన్ హై కమిషన్‌కు చెందిన ఇద్దరు అధికారులు అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. పాక్ లోని ఇస్లామాబాద్‌లో గల ఇండియన్ హై కమిషన్‌లో పనిచేస్తోన్న ఆ ఇద్దరు అధికారులు.. ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి ఒక్కసారిగా అదృశ్యమైనట్లు ఇండియన్ హై కమిషన్ తెలిపింది. అధికారుల అదృశ్యంపై పాకిస్థాన్‌ ప్రభుత్వానికి ఇండియన్ హై కమిషన్ సమాచారం ఇచ్చింది.

కాగా, ఇటీవల న్యూ ఢిల్లీలోని పాకిస్థాన్‌ హై కమిషన్ లో పని చేసే ఇద్దరు అధికారులని గూఢచార్యానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత భారత ప్రభుత్వం వారిని దేశం నుంచి బహిష్కరించింది. ఆ ఘటన జరిగిన కొద్ది రోజుల తరువాత భారత హై కమిషన్‌కు చెందిన అధికారులు అదృశ్యమవడం ఆందోళన కలిగిస్తోంది.