English | Telugu
15వ శతాబ్దంలో కట్టిన మసీదు.. పునాదులతో సహా పెకిలించి తరలించారు
Updated : Dec 17, 2019
మనిషి అన్ని పనులూ అవసరం కోసమే చేయడు. అలాగని పూర్తిగా నమ్మకాలు విశ్వాసాల మేరకు నడుచుకోడు, రెండింటినీ మేళవించి జీవన ప్రయాణాన్ని కొనసాగిస్తూంటాడు. మరి ఒకవేళ ఈ రెండూ ఒకదానితో ఒకటి క్లాష్ అయితే అప్పుడు ఎలా, రెండిట్లో దేనికి ప్రయారిటీ ఇవ్వాలి, ఇటు కూటికి అటు దేవునికీ మధ్య సంఘర్షణ జరిగితే దేని వైపు నిలబడాలి ఆదిదేవుడి ఈ శరీరాన్ని పుట్టించాడు కాబట్టి పొట్టకూటిని కాదని దేవుడు వైపు నిలబడాలా లేక శరీరంలో జీవం నిలబడాలంటే తిండి కావాలి కాబట్టి కూటి కోసం పాట్లు పడాలా, సరిగ్గా ఇదే భేతాళ ప్రశ్న ఎదురైంది టర్కీలో. చాదస్తం ముస్లిం పోకడలను పక్కన బెట్టి కాస్తంత ఆధునిక భావాలను నింపుకున్న టర్కీలోని ముస్లిం సమాజం వాదోపవాదాలు సిద్ధాంత రాద్ధాంతాల జోలికి పోకుండా టెక్నాలజీ వాడింది. టర్కీ లోని టైగ్రిస్ నది పరివాహక ప్రాంతంలో ఉన్న హాసం కీప్ నగరంలో 15 వ శతాబ్దంలో కట్టిన మసీదుకు చాలా పెద్ద చరిత్రే ఉంది. అయితే కొత్తగా నిర్మిస్తున్న ఇల్స్యూడ్ డ్యామ్ కారణంగా ఈ మసీదు ఉన్న ప్రాంతం మునిగిపోతుంది. ప్రజలకు నష్ట పరిహారం ఇచ్చేసి వేరే ప్రాంతానికి తరలించేసిన ఈ మసీదుతో చిక్కొచ్చి పడింది. ఏం చెయ్యాలని ఆలోచించారు అధికారులు. అయితే ఛాందస భావాల ప్రభావానికి గురై ఏకంగా డ్యామ్ డిజైనే మార్చకుండా ఎంచక్కా మసీదుని తరలించారు. అందుబాట్లో ఉన్న హైఎండ్ టెక్నాలజీతో మసీదును పునాదులతో సహా పెకిలించి దాన్ని మరో ప్రాంతంలో ప్రతిష్టింపచేశారు చాలా సింపుల్ గా, ఇదే సమస్య ఏ ఆఫ్గనిస్థాన్ లోను లేక ఐసిస్ హుకుమ్ నడిచిన రోజులలో దాని ఏలుబడిలో ఉన్న ప్రాంతాల్లోనూ జరిగితే ఏమయ్యేదో అందరికీ తెలిసిందే కదా, ప్రజలు ఆకలితో చచ్చినా సరే దైవత్వం నిలబడాలని అవసరమైతే ఆ ఆకలి కడుపులపై కూడా తూటాలు పేల్చేవారు.