English | Telugu
ఏపీలో మరోసారి అన్యమత ప్రచారం కలకలం
Updated : Jul 7, 2020
ఐతే తాజాగా గుంటూరుకు చెందిన ఒక వ్యక్తికి జరిగిన సంఘటన మళ్ళీ తిరుమలలో జరుగుతున్న అన్యమత ప్రచారాన్ని వెలుగులోకి తెచ్చింది. ఆ వ్యక్తికి గత పదేళ్ల నుండి తిరుమల నుండి వెలువడే సప్తగిరి మాస పత్రిక కు సబ్ స్క్రిప్షన్ ఉంది. ఐతే తాజాగా వచ్చిన సప్తగిరి మాస పత్రిక తో పాటు అన్య మత ప్రచారానికి సంబంధించిన “సజీవ సువార్త” అనే పుస్తకం కూడా ఆయనకు చేరింది. దీంతో ఆశ్చర్యపోయిన అయన ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన వారి పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దీంతో మరో సారి తిరుమలలో అన్యమత ప్రచారం పై తీవ చర్చ జరిగే అవకాశం ఏర్పడింది.