English | Telugu

సి.ఎం రిలీఫ్ ఫండ్ కు క‌రోనా విరాళాలు!

లాక్ డౌన్ ప్ర‌భావంతో తెలంగాణా ప్ర‌భుత్వానికి వ‌చ్చే రాబ‌డి తగ్గిపోయింది. ఆర్థిక వ్యవస్థపై పెను భారం పడింది. పైగా కరోనా నియంత్ర‌ణ‌ కోసం భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇదంతా ప్రభుత్వానికి తలకు మించిన భారంగా తయారైంది. ఈ పరిస్థితుల్లో పలువురు వ్యక్తులు, స్వచ్చంద సంస్థలు స్పందించి మానవత్వం చాటుకుంటున్నారు. త‌మ‌వంతు సాయం అందిస్తున్నారు. మేము సైతం అంటూ కరోనాపై ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి అండగా నిలుస్తున్నారు. సీఎం సహాయనిధికి విరాళాలు ఇస్తున్నారు. హీరో నితిన్‌ పది లక్షల విరాళాన్ని ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి చెక్‌ అందించారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఒకరోజు మూల వేతనాన్ని ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రతినిధులు సీఎం సహాయనిధికి రూ.48కోట్లు విరాళంగా అందజేశారు. అలాగే ముఖ్యమంత్రి సహాయనిధికి సత్యనాదెళ్ల సతీమణి అనుపమ రూ.2కోట్ల విరాళం అందించారు. ఈ సందర్భంగా అనుపమ తండ్రి, విశ్రాంత ఐఏఎస్‌ కేఆర్‌ వేణుగోపాల్‌ సీఎంను కలిసి చెక్‌ అందజేశారు.