English | Telugu

టీఆర్ఎస్ కు సీపీఐ మద్దతు వెనుక మ్యాటరేంటి?

హుజూర్ నగర్ ఉప ఎన్నిక కోసం సీపీఐ, టీఆర్ఎస్ ల మధ్య కుదిరిన బంధం వెనుక కారణాలేంటి అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ నీయాంశంగా మారింది. తెలంగాణలో రోజురోజుకు కమ్యూనిస్టు పార్టీల ప్రభావం తగ్గుతున్న వేళ హుజూర్ నగర్ లో మద్దతు కోరి గులాబీ బాస్ సీపీఐకి ఊపు తెచ్చారు. సాధారణ ఎన్నికల్లో మహాకూటమితో కలిసి సీపీఐ పోటీ చేసింది. టీఆర్ ఎస్ టార్గెట్ గా సీపీఐ నేతలు మాటల తూటాలు పేల్చారు. ఎన్నికలైనా ఏడాది కూడా కాక ముందే సీపీఐ నేతలు ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నారు. మహా కూటమి ఫ్రెండ్స్ కాదని టీఆర్ఎస్ కు మద్దతి ఇచ్చారు. ఈ సడన్ యూటర్న్ వెనుక కారణాలేంటి అనేది ఇప్పుడు డిస్కషన్ పాయింట్ అయింది. రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే సీటు గెలిచిన సీపీఐ మొన్నటి ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది, ఓట్ల శాతం కూడా తగ్గింది. ప్రస్తుతం ఏ సభలోనూ సిపిఐకి ప్రాతి నిధ్యం లేదు. ప్రస్తుతం కుదిరిన ఒప్పందంలో భాగంగా ఓ ఎమ్మెల్సీ చాన్స్ ఇస్తామని టీఆర్ఎస్ చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఈ పొత్తును కొనసాగించాలి అనేది ఇరు పార్టీల మధ్య అవగాహన కుదిరినట్టు చెబుతున్నారు. పొత్తుతో కొన్ని చోట్ల పోటీ చేసి మున్సిపాలిటీలో పాగా వేయాలని సీపీఐ నేతల ఆలోచనగా తెలుస్తోంది. మొత్తానికి టీఆర్ఎస్ కి సీపీఐ మద్దతు ఇవ్వటం వెనక రాజకీయ, ఆర్థిక కారణాలు కూడా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.