English | Telugu

నాటుసారా కేంద్రాల‌పై మెరుపు దాడులు

నాటుసారా నిల్వలు ఉన్నాయనే సమాచారం మేరకు జిల్లాను జల్లెడ ప‌డుతున్నారు. 10 వేల మంది సిబ్బందితో పోలీసు, ఎక్సైజ్ శాఖ మెరుపుదాడులు చేస్తూ హ‌డ‌లెత్తిస్తున్నారు.

ఎన్నికల్లో పూర్తిగా మద్యం, డబ్బు పంపిణీని కట్టడి చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగుతున్న మెరుపు దాడులు. ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ గౌతమ్ సవాంగ్ డైరెక్ష‌న్‌లో ఇటీవ‌ల ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఆర్డినెన్స్ కు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ మరియు డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల మెరుపు దాడులు ప్రారంభించారు.

పోలీస్, ఎక్సైజ్ శాఖ సమన్వయంతో నాటు సారా తయారీ కేంద్రాలపై బుధ‌వారం తెల్ల‌వారుఝాము 4 గంటల నుండి దాడులు కొన‌సాగుతున్నాయి. పదివేల మంది సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.

వందలాది మంది పోలీస్ అధికారులతో కూడిన బృందాలతో , అడిషనల్ ఎస్పీ, డీఎస్పీలు, ప్రొబేషనరీ ఐపీఎస్, సిఐలు,ఎస్సైలు, మొత్తం పది వేల మంది సిబ్బందితో రాష్ట్ర వ్యాప్తంగా మెరుపు దాడులు చేస్తున్నారు.

నాటుసారా నిల్వలు ఉన్నాయనే సమాచారం మేరకు జిల్లాను జల్లెడ పడుతున్నారు. ఇప్పటి వరకు పెద్ద మొత్తంలో బెల్లం ఊట నిల్వలు, నాటుసారా నిల్వలను ధ్వంసం చేశారు.

స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా కొద్దిరోజుల పాటు మద్యం సరఫరాను నిలిపివేశారు. ఈనెల 12 నుంచి 29 వరకు మద్యం దుకాణాలను మూసివేయనున్నట్లు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఎన్నికల్లో ఓటర్లపై డబ్బు, మద్యం ప్రభావం ఉండకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 21 నుంచి పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది.