English | Telugu

ఒక పక్క కరోనా మరో పక్క నిసర్గ

మహారాష్ట్ర లో కరోనా ఉధృతి తీవ్రంగా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 70,000 దాటింది. ఇందులో ముంబై నగరం లోనే 41,000 కేసులు నమోదయ్యాయి. ఇలా ఒక వైపు కరోనా వణికిస్తుంటే మరో వైపు అరేబియా సముద్రం లో ఏర్పడిన అల్ప పీడనం తుఫాన్ గా మారి రాష్ట్రం పై తన ప్రభావాన్ని చూపబోతోంది. ఈ తుఫాన్ కారణంగా 125 కిలోమీటర్లకు పైగా వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలుపుతోంది. దీంతో ముంబై లోని ఎంఎంఆర్డీఏ లో చికిత్స పొందుతున్న 150 మంది కరోనా పేషేంట్లను వర్లీ కి షిఫ్ట్ చేసారు. అదే సమయం లో రాష్ట్ర ప్రభుత్వం నిసర్గ తుఫాన్ వల్ల రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు గా తెలిపింది.