English | Telugu

నిమ్మగడ్డ కేసులో అసలేం జరుగుతోంది.. బీజేపీ ఎంట్రీతో మరింత ఉత్కంఠ!

ఏపీ ఎలక్షన్ కమిషనర్ గా నిమ్మగడ్డ కు తిరిగి బాధ్యతలు అప్పగించాలని హైకోర్టు తీర్పు ఇచ్చిన తరువాత కూడా ప్రతిష్టంభన కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఐతే హైకోర్టు మొన్నటి తీర్పు పై స్టే కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర హైకోర్టు లో పిటిషన్ వేసి తాజాగా విచారణ సందర్భంలో దాన్ని ఉపసంహరించుకుంటున్నట్లుగా తెలిపింది. అదే సమయం లో హైకోర్టు తీర్పు పై సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. లేటెస్ట్ గా ఇదే విషయం పై ఎపి బీజేపీ నాయకులు మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ సుప్రీం కోర్టులో కేవియట్ దాఖలు చేశారు. రమేష్ కుమార్ తొలగింపు పై కామినేని పార్టీ జాతీయ నాయకత్వ అనుమతి తో ఎపి హై కోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఒక పక్క నిమ్మగడ్డను ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ పదవిలోకి తీసుకోకూడదని వైసిపి ప్రభుత్వం డిసైడ్ అయిన నేపధ్యం లో మరో పక్క బీజేపీ జాతీయ నాయకత్వ అనుమతి తో కామినేని కేవియట్ దాఖలు చేయటం తో రమేష్ కుమార్ వ్యవహారం ఎటు దారి తీస్తుందోనని అందరు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.