English | Telugu
రాష్ట్రపతిని కలిసిన రఘురామ కృష్ణంరాజు.. ఆయనకంతా తెలుసు!!
Updated : Jul 21, 2020
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతే కొనసాగాలని ఎంపీ రఘురామ కృష్ణంరాజు డిమాండ్ చేశారు. ప్రజలంతా అమరావతే రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నారని తెలిపారు. ఈ విధంగానే రాష్ట్రపతికి విన్నవించానని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏ కులాన్నైతే ద్వేషిస్తుందో.. ఆ కులం వారికంటే ఎస్సీ, ఎస్టీ వాళ్లే ఎక్కువగా రాజధాని కోసం భూములిచ్చారని తెలిపారు. కనుక వాళ్ల కోసమైనా అమరావతిని కొనసాగించాలని అన్నారు. పోరాడి అమరావతే రాజధానిగా ఉండేలా కృషి చేద్దాం. ఎందుకంటే గత ప్రభుత్వం అమరావతి కోసం చాలా ఎక్కువగా డబ్బు ఖర్చు చేసిందన్నారు. అయినా ఇప్పుడు విశాఖలో రాజధాని కట్టడానికి అంత డబ్బు ఎక్కడిది? దీన్ని కూడా ప్రజలు నిలదీయాలి అని రఘురామ కృష్ణంరాజు అన్నారు.
రాష్ట్రంలో ఏం జరుగుతుందో రాష్ట్రపతికి ముందే తెలిసినట్టుగా ఉందని రఘురామ కృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను చెప్పాలనుకున్న సమాచారం అంతా రాష్ట్రపతి దగ్గర ముందే ఉందని తెలిపారు.