English | Telugu
కరోనా కట్టడికి పెట్రోల్ ధరలు పెంచానంటారేమో!
Updated : Jul 21, 2020
పెట్రోల్, డీజిల్ ఛార్జీల పెంపుపై ట్విట్టర్ వేదికగా స్పందించిన టీడీపీ నేత నారా లోకేష్.. జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. "బాదుడే బాదుడు. కరోనా సమయంలో విద్యుత్ ఛార్జీలు ఘోరంగా పెంచి పేద ప్రజల కష్టాన్ని దోచుకున్నారు. ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. ఇప్పుడు లీటర్ పెట్రోల్ పై రూ.1.24 పైసలు, డీజిల్ పై 93 పైసలు పెంచేసారు. పెట్రోల్, డీజిల్పై అదనపు వ్యాట్ను రూ.4కు పెంచడం సామాన్యుల నడ్డి విరచడమే." అని లోకేష్ విమర్శించారు.
ధరలు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని లోకేష్ డిమాండ్ చేశారు. ధరలు పెంచి మద్యనిషేధం అన్న మేధావి కరోనా కట్టడికి పెట్రోల్ ధరలు పెంచానంటారేమో! అంటూ సీఎం జగన్ పై లోకేష్ వ్యంగాస్త్రం సంధించారు.