English | Telugu

సీఎంలను వాడు వీడు అంటున్న ఆ డాక్టర్ కి ఎంత బలుపు!

నర్సీపట్నంలో ఆరోపణలు చేసిన వ్యక్తి అసలు డాక్టరేనా ? రాజకీయ నాయకుడా, అని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖా మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. " సీఎంలను వాడు వీడు అంటున్న ఆ డాక్టర్ కి ఎంత బలుపు," అని ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి పేర్ని నాని, డాక్టర్ ఆరోపణ చేసిన ఆసుపత్రిలోనే 20పీపీఈలు ఉన్నాయని చెప్పారు. " అసలు ఆ ఆసుపత్రి కరోనా ఆసుపత్రి కాదు.ఏపీలో 7 ల్యాబ్‌లలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నాం. రోజుకు 1175 మందికి కరోనా పరీక్షలు చేస్తున్నారు. 24,000 వేల బెడ్స్‌ సిద్ధంగా ఉన్నాయి.ఎన్‌-95 మాస్క్‌లు,పీపీఈ కిట్స్‌ సమృద్ధిగా ఉన్నాయి," అని చెప్పిన మంత్రి ప్రభుత్వంపై దుష్ప్రచారం మానుకోవాలని కోరారు.