English | Telugu
తిరుపతిలో చికెన్, మటన్ దుకాణాలు బంద్!
Updated : Apr 25, 2020
లాక్ డౌన్ ముగిసేవరకు ప్రతి ఆదివారం తిరుపతి నగరంలో చేపలు, చికెన్ మరియు మటన్ దుకాణాలు తెరవకూడదు. ఈ చర్య ప్రజాఆరోగ్యమును దృష్టిలో వుంచుకొని తీసుకున్న ముందు జాగ్రత్త చర్య అట్లు సూచనలు పాటించక దుకాణములు తెరిచిన యెడల చట్ట పరమైన చర్యలు తీసుకోబడును. ఈ నిబంధనలు ఉల్లంఘించిన యెడల దుకాణం సీజ్ చేసి, ట్రేడ్ లైసెన్స్ రద్దు చేస్తామని మున్సిపల్ కమీషన్ హెచ్చరిస్తూ ఆదేశాలు ఇచ్చారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో చికెన్, మటన్ దుకాణాలు తెరిచినచో కాల్ సెంటర్ 0877-2256766 కి సమాచారం ఇవ్వాలని కమీషనర్ కోరారు.