English | Telugu

సిఎం‌ కేసీఆర్ మాటలకే పరిమితం అవుతున్నారు!

ఓ వైపు కరోనా ప్రభావం, మరోవైపు వడగళ్ళ వానతో రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. యాదాద్రి జిల్లాలో వడగళ్ల వానతో తీవ్ర నష్టం జరిగినా ఏ ఓక్క అధికార పార్టీ ఎమ్మెల్యే రైతులను పరామర్శించలేదు. నష్ట పోయిన రైతులకు ఎకరాకు 20 వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ఎంపి డిమాండ్ చేశారు. బత్తాయి నిమ్మ రైతులతో రైతులకు తీవ్ర నష్టాలు తెస్తున్నాయి.అయినా ప్రభుత్వం పట్టించుకోకుండా సిఎం‌ కేసీఆర్ మాటలకే పరిమితం అవుతున్నారు. ప్రశ్నిస్తే ,లోపాలు బయటకు తీసుకువస్తే మీడియాను బెదిరిస్తున్నారని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సి.ఎం. ఫామ్ హౌజ్ చుట్టూ డబుల్ రోడ్లు ,ఫామ్‌హౌజ్ లో కొత్త ఇళ్లు, ప్రగతి భవన్ లో ఇళ్లు కట్టుకోవడానికే సిఎం బిజీగా వున్నార‌ని ఎంపి విమ‌ర్శించారు.