English | Telugu

కిషన్ రెడ్డి, నిర్మలకు తెలుగు రాష్ట్రాల్లో కరోనా పర్యవేక్షణ బాధ్యతలు...

తెలంగాణ 33 జిల్లాల పర్యవేక్షణ బాధ్యతను కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, ఏపీలో 13 జిల్లాలను పర్యవేక్షణ బాధ్యతను ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ కు అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీరు ఎప్పటికప్పుడు అధికారులకు తగిన సూచనలు ఇవ్వడంతోపాటు, కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం విధించిన 21 రోజుల లాక్‌డౌన్ నేపధ్యం లో వైరస్‌ను ఎదుర్కొనేందుకు తెలుగు రాష్ట్రాల్లో క్షేత్రస్థాయి పరిస్థితిని సమీక్షించి, కేంద్రానికి నివేదిక ఇస్తారు. కరోనా పరిస్థితి, సహాయక చర్యలపై నేరుగా అధికారులతో చర్చించి వీరిద్దరూ ఎప్పటికప్పుడు వివరాలు సేకరించనున్నారు.వాటి ఆధారంగా అధికారులకు, ప్రభుత్వ యంత్రాంగాలకు తగిన సూచనలు ఇవ్వాలని కేంద్ర మంత్రులను ప్రధాని మోదీ ఆదేశించారు. తెలంగాణలో ఇప్పటిదాకా 45 కేసులు నమోదవగా, ఏపీలో 11 మందికి కరోనా వైరస్‌ సోకింది.