English | Telugu
ప్లాస్మా ట్రీట్మెంట్ కోసం ఏపీ కి ఇంకా అనుమతి రాలేదు
Updated : Apr 23, 2020
ప్రతి పది లక్షల మందికి 961 పరీక్షలు చేస్తున్నామన్నారు.కర్నూల్ ఆసుపత్రిని కూడా కొవిడ్ ఆసుపత్రిగా మారుస్తున్నారు. " పేషంట్ మేనేజ్మెంట్ కు ప్రత్యేక అప్లికేషన్ పెట్టాం. ప్రతి హాస్పిటల్ నుండి కంట్రోల్ రూం కి వీడియో కాన్ఫరెన్స్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేశాం. టెలి మేడిసిన్ లో ఇప్పటికి 306 మంది డాక్టర్ లు వాలెంట్రీగా సేవ చేస్తున్నారు . 4,000 పైగా కన్సల్టేషన్ లు జరిపాం. కొత్తగా సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చాం. పిపిఈ లు 3 లక్షల పైగా ఉన్నాయి. 1.4 లక్షల N95 మాస్కులు అందుబాటులో ఉన్నాయి. ప్రతి వ్యక్తికి మూడు మాస్కుల పంపిణీ చేస్తున్నాం. ఆక్సిజన్ సప్లై పైన దృష్టి పెట్టాం .... ఆక్సిజన్ సప్లై లైన్ లు కొత్తగా వేస్తున్నాం," అని ఆయన వివరించారు. ర్యాపిడ్ కిట్స్ పై నిన్న సాయంత్రం ఐ సి ఎం ఆర్ నుండి పెర్మిషన్ వచ్చిందని, ర్యాపిడ్ టెస్ట్ లో.పాజిటివ్ వస్తే ఆర్సీపీటీఆర్ ద్వారా ఫైనల్ నిర్ధారణ చేస్తున్నామని చెప్పారు. " ర్యాపిడ్ టెస్ట్ కేవలం కమ్యూనిటీ టెస్టింగ్ కోసమే..పూర్తిగా ర్యాపిడ్ కిట్స్ పైనే డిపెండ్ అయ్యి లేము..కరోనా 14 లేదా.. 28 రోజులా అనేది ఇంకా స్పష్టత రాలేదు..కొన్ని కేసులు 14 నుండి 28 రోజుల మధ్యలో కూడా బయటపడుతున్నాయి," అని కూడా జవహర్ రెడ్డి చెప్పారు.