English | Telugu
కరెంట్ బిల్లులు మాఫీ చేసి ఇంటి అద్దె ప్రభుత్వమే చెల్లించాలి! జగ్గారెడ్డి డిమాండ్
Updated : May 5, 2020
రాష్ట్రంలో లాక్ డౌన్ తో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జగ్గారెడ్డి తెలిపారు. ముఖ్యంగా ఆర్ధిక ఇబ్బందులు చుట్టుముడుతున్నాయని, ఇంటి అద్దెలు కూడా కట్టుకోలేని పరిస్థితి కనిపిస్తోందని అన్నారు. ప్రభుత్వం ఇచ్చే రూ.1500 కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు బాగానే ఉన్నా, పేదలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. మూడు నెలల పాటు అద్దె మినహాయించినా, తర్వాత కట్టాల్సిందే కదా అని అభిప్రాయపడ్డారు. అందుకే, ఇంటి అద్దెలు కరెంట్ బిల్లులు కూడా ప్రభుత్వమే భరించాలని ఆయన సూచించారు.