English | Telugu
జూన్ 1 నుంచి రోజూ 200 రైళ్లు
Updated : May 20, 2020
ఈ మేరకు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ట్వీట్ చేశారు. అన్ని కేటగిరీల ప్యాసింజర్లు ఆన్ లైన్లో టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. త్వరలోనే బుకింగ్ ప్రారంభమవుతుందని పీయూష్ గోయల్ ట్వీట్ చేశారు. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీ నుంచి పలు రాష్ట్రాలకు కొన్ని ప్రత్యేక రైళ్లను రైల్వే నడుపుతున్న సంగతి తెలిసిందే. వీటికి తోడు.. వలస కూలీలను తరలించే రైళ్లు కూడా రాకపోకలు సాగిస్తున్నాయి. అలాగే శ్రామిక్ రైళ్లను రెట్టింపు చేశామని, మంగళవారం రాత్రి నుంచి 200 శ్రామిక రైళ్లు నడుపుతున్నట్లు తెలిపారు.