English | Telugu
కరోనా నేపథ్యంలో జంతు వధపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
Updated : Jul 30, 2020
ఈ పిల్ విచారణ సందర్భంగా జంతుమాంసం ద్వారా కూడా వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉందని, చైనాలో గబ్బిలాలు వంటి వాటిని తినడం వల్లే కరోనా వచ్చిందన్న ప్రచారం కూడా ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. విచారణ సందర్భంగా ప్రభుత్వం తన వాదనలు వినిపిస్తూ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో జంతువధ కేంద్రాలను తనిఖీ చేశామని వెల్లడించింది. దాంతో, మాంసం దుకాణాలను తనిఖీ చేస్తున్నారా అని హైకోర్టు జీహెచ్ఎంసీ అధికారులను ప్రశ్నించింది. దీనికి సంబంధించిన పూర్తీ వివరాలతో రెండు వారాల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.