జమ్మూకశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 ను రద్దు చేసి ఆగస్టు 5 కి ఏడాది కావస్తున్నందున దాడులు చేసేందుకు ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఆగస్టు 5న దేశంలోని పలు ప్రాంతాల్లో దాడులకు ప్లాన్ చేస్తున్నట్టు ఇంటెలిజెన్స్ సమాచారం. ఆగస్టు 5న అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి కూడా భూమిపూజ జరుగనుండటంతో, ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించే అవకాశాలున్నాయని హెచ్చరించింది. ఉగ్రవాదులతో కూడిన ఓ బృందం పాకిస్తాన్ నుంచి భారత్లోకి చొరబడేందుకు వేచి చూస్తున్నట్లు అనుమానిస్తున్నాయి. ఉగ్రవాదులు ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే వేడుకలను కూడా టార్గెట్ చేశారని సమాచారం. ఇంటెలిజెన్స్ సమాచారంతో దాడులకు అవకాశమున్న ప్రాంతాల్లో భద్రతాధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. అయోధ్య, ఢిల్లీ, జమ్మూకశ్మీర్లో భద్రతా ఏర్పాట్లను మరింత పటిష్టం చేశారు.