English | Telugu

మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు కోర్టులో చుక్కెదురు

వైసీపీ నాయకుడు, మచిలీపట్నం మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ మోకా భాస్కరరావు హత్య కేసులో ఏ-4 నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు చుక్కెదురైంది. ఈ కేసులో కుట్రదారుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కొల్లు రవీంద్ర.. బెయిల్ కోరుతూ కృష్ణా జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం బెయిల్‌ పిటిషన్‌ ను కొట్టేసింది. కొల్లు రవీంద్ర బయటికి వస్తే ఈ కేసును ప్రభావితం చేసే అవకాశం ఉందన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలను కోర్టు సమర్థించింది. కొల్లు రవీంద్రతో పాటు మిగతా నిందితులకు కూడా కోర్టు బెయిల్‌ నిరాకరించింది.