English | Telugu
డిసెంబర్ 1న గ్రేటర్ పోలింగ్. రేపటి నుంచే నామినేషన్లు
Updated : Nov 17, 2020
జీహెచ్ఎంసీ ఎన్నికలు ఈసారి బ్యాలెట్ పద్ధతిలోనే జరగనున్నాయి. జీహెచ్ఎంసీ చట్ట ప్రకారమే 150 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తామని, 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అమలైన రిజర్వేషన్లే ఇప్పుడూ కొనసాగిస్తామని పార్థసారథి తెలిపారు. రిజర్వేషన్ల కేటాయింపులు అనేది ప్రభుత్వ వ్యవహారమని, అసెంబ్లీ ఓటర్ల జాబితా ఆధారంగానే ఈ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. 2020 జనవరి 1 నాటికి 18 ఏళ్లు పూర్తి చేసుకున్న వారు ఓటు వేసేందుకు అర్హులని వివరించారు. ఎన్నికల ఏర్పాట్ల ప్రక్రియను కావాల్సిన అన్ని పనులు పూర్తి చేసినట్లు చెప్పారు ఎస్ఆసీ పార్థసారథి
జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 74,04,000 మందికి పైగా ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 38 లక్షల 56 వేల 770 మంది కాగా.. మహిళలు 35 లక్షల 46 వేల 847 మంది. ఇతరులు 669. గ్రేటర్ లో మొత్తం పోలింగ్ కేంద్రాలు 9248 .గ్రేటర్ లోని పలు పోలింగ్ కేంద్రాల్లో ఈ ఓటింగ్ కు ప్రవేశ పెట్టే అవకాశం ఉందని పార్థసారథి తెలిపారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఫేస్ రికాగ్నసేశన్ తో ఓటర్లను గుర్తింపు ప్రక్రియ చేపట్టనుంది. . మైలార్దేవ్పల్లిలో అత్యధికంగా 79,290 మంది, రామచంద్రాపురంలో అత్యల్పంగా 27,997 మంది ఓటర్లు ఉన్నారు.