English | Telugu
కరోనా లక్షణాలున్నాయని యువకుడిపై రాళ్లదాడి!
Updated : Mar 27, 2020
కర్ణాటకలోని ఉమ్నాబాద్కు చెందిన చంద్రకాంత్(35) సంగారెడ్డి జిల్లాలో నివసిస్తూ ప్యాసింజర్ ఆటో నడుపుతుంటాడు. అతను గురువారం నాడు రామచంద్రాపురం మండలం బండ్లగూడ సమీపంలో దగ్గుతూ స్పృహ తప్పి పడిపోయాడు. ఇది చూసిన స్థానికులు అతనికి కరోనా వచ్చిందేమోనన్న అనుమానం, తమకెక్కడ ఆ వైరస్ అంటుతుందేమోనన్న భయంతో అతనిపై రాళ్ల దాడి చేశారు. విషయం తెలుసుకున్న రామచంద్రాపురం పోలీసులు అక్కడికి చేరుకొని అతన్ని పటాన్చెరు ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటన చూస్తుంటే కరోనా మనుషుల కన్నా ముందు వారిలోని మానవతాన్ని చంపేస్తుందేమో అనిపిస్తుంది. మనుషులకు ప్రాణ భయం ఉండటం సహజమే.. కానీ ఆ భయం ఎదుటి వ్యక్తి ప్రాణాలు తీసే అంత కౄరంగా మారకూడదు. దగ్గు, తుమ్ములు ఉన్న ప్రతి ఒక్కరికి కరోనా ఉన్నట్లు కాదు. ఒకవేళ అంతలా అనుమానం ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వండి. అంతేకాని ఇలా దాడులు చేయకండి.