భారత్ లో కరోనా మహమ్మారి మరింతగా విజృంభిస్తోంది. రోజురోజుకి కేసులు పెరుగుతున్నాయి. ప్రతిరోజూ ఐదువేలకి పైగా కేసులు నమోదవుతున్నాయి. తొలిసారిగా 24 గంటల వ్యవధిలో 5,600కు పైగా కేసులు నమోదయ్యాయి. మంగళవారం నాడు దేశవ్యాప్తంగా 5,611 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, 140 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారికంగా ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,06,750కి చేరగా, వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 3,303 కి చేరింది. ప్రస్తుతం 61,149 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా, 42,297 మంది వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.