English | Telugu
ఆగిన మగ్గం! నేతన్నల ఆకలి కేకలు! స్థంభించిన కోట్లది రూపాయల లావాదేవీలు!
Updated : May 4, 2020
దేశవ్యాప్తంగా నెలకొన్న కరోనా పరిస్థితుల్లో చేనేత మగ్గాలు ఆగిపోయి నేతన్నలు ఆకలితో బాధపడుతున్నారు. కరోనా నేతన్నను పూర్తిగా ముంచేసింది. నేచిన చీరలు అమ్ముడుపోక అవస్థలు పడుతున్నారు. లాక్డౌన్ కారణంగా దుకాణాలు మూతపడటం, రవాణా రంగం స్తంభించడంతో చేనేత రంగం నష్టాల బాటపట్టింది. వెంకటగిరి కేంద్రంగా చేనేత వస్త్రాల వ్యాపారం జోరుగా సాగుతుంది. రోజుకు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల మేర వ్యాపార లావాదేవీలు నడుస్తాయి. అయితే, ఒక్కసారిగా దుకాణాలు మూతపడటంతో కోట్లది రూపాయల లావాదేవీలు ఆగిపోయాయి.
రాష్ట్రంలో మాస్టర్స్ బేవర్స్ మరియు చేనేత సంఘాల వద్ద పేరుకుపోయిన నిల్వలను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి చేనేత రంగాన్ని కాపాడాలి. రంగులను డిపోల ద్వారా అందించి చేనేత కార్మికులకు పని కల్పించాలి. లేనిచో కార్మికుల్లో ఆకలి చావులు ఆత్మహత్యలు పెరిగే ప్రమాదం ఉంది.