English | Telugu
కరోనా తగ్గడంలేదు! ఉధృతంగా ఉంది! ఇళ్లకే పరిమితం అవ్వండి! సి.ఎం.
Updated : Apr 19, 2020
14 అంతస్థుల స్పోర్స్ట్ కాంప్లెక్స్ను హెల్త్ డిపార్టెమెంట్కు బదిలీ చేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. నిమ్స్ కంటే ఎక్కువ సదుపాయాలతో కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా తెలంగాణా ఇన్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసర్చ్ టిమ్స్ను తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రస్తుతం దీన్ని కరోనా ప్రత్యేక ఆసుపత్రిగా ఉపయోగిస్తాం. 1500 బెడ్లను సిద్ధం చేశాం. రేపటి నుంచి గచ్చిబౌలి కరోనా ఆసుపత్రి ఉపయోగంలోకి వస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రంలో రోజుకు 1500 మందికి టెస్ట్లు చేసే సదుపాయం వుంది.
జూన్ 7వ వరకు ఫంక్షన్లకు అనుమతి ఇవ్వం. కాబట్టి ఫంక్షన్ హాళ్లను తాత్కాలిక గౌడన్లుగా వాడుకొని రైతులకు ఆదుకోమని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
మే 7వ తేదీ వరకు లాక్డౌన్ పొడిగింపు తన వ్యక్తి గత నిర్ణయం కాదు. ప్రభుత్వం సర్వే ద్వారా ప్రజల నుంచి సేకరించిన సమాచారంతో క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు.