English | Telugu
బ్లీచింగ్, పారాసిటమాల్ అంటూ నిర్లక్ష్యం.. కరోనా కట్టడిలో వైసీపీ ప్రభుత్వం విఫలం
Updated : May 27, 2020
ఎల్జీ పాలిమర్స్ కంపెనీకి వైసీపీ ప్రభుత్వం వంతపాడుతోందని మండిపడ్డారు. ఎల్జీ పాలిమర్స్ కంపెనీ తరుపున ప్రభుత్వం పరిహారం ఇవ్వడమేంటని ప్రశ్నించారు. అధికార అహంకారంతో ఎన్నికల అధికారిని తొలగించారన్నారు. రాజధాని తరలింపు విషయంలో సెలక్ట్ కమిటీపై మండలి చైర్మన్ ఇచ్చిన ఆదేశాలను కార్యదర్శి ఎందుకు అమలు చేయరని ప్రశ్నించారు. ప్రశ్నించినవారి పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. పీపీఈ కిట్లు అడిగిన డాక్టర్ సుధాకర్ను హింసిస్తున్నారన్నారు. మీడియాపై చీకటి జీవో ఇచ్చారని, సోషల్ మీడియాపై ఉక్కుపాదం మోపుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.