English | Telugu

ఆ డబ్బు నాదే.. స్టిక్కర్ మాత్రం మా డ్రైవర్ ది

ఎపి తమిళనాడు బోర్డర్ లో 5.3 కోట్ల నగదు తో కొంతమంది తమిళనాడు పోలీసులకు పట్టుబడడం తో ఎపి రాజకీయాలలో తీవ్ర కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ సొమ్ము ప్రకాశం జిల్లా వైసిపి నాయకులదేనని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దీని పై ఒంగోలుకు చెందిన బంగారం వ్యాపారి నల్లమల్లి బాలు స్పందిస్తూ ఆ డబ్బు తనదేనని ఐతే కారుకు ఎమ్మెల్యే స్టిక్కర్ మాత్రం తన కార్ డ్రైవర్ అతికించాడని చెప్పారు. అసలు ఆ స్టిక్కర్ కాలం చెల్లిందని అంతే కాకుండా తన డ్రైవర్ దానిని ఎక్కడ నుండి తెచ్చాడో తనకు తెలియదని చెప్పారు. శ్రావణ మాసం వస్తున్నందున బంగారు నగలు కొనడానికి ఆ నగదుని చెన్నై తీసుకు వెళుతున్నట్లుగా అయన తెలిపారు. కొంత మంది విమర్శిస్తున్నట్లు ఈ ఘటన తో మంత్రి బాలినేని కి ఎటువంటి సంబంధం లేదని అయన వివరించారు. ఐతే నల్లమల్లి బాలు మంత్రి బాలినేనికి ముఖ్య అనుచరుడు కావడం తో పాటు వైసిపి తరుఫున కార్పొరేటర్ గా పోటీ లో ఉండడం తో ఇప్పట్లో ఈ రాజకీయ దుమారం సద్దుమణిగేటట్లు లేదు.