English | Telugu
భారత్ లో కరోనా లేని ప్రాంతం ఉంది.. ఎక్కడో తెలుసా..?
Updated : Jul 18, 2020
లక్షద్వీప్ చేరాలంటే అటు షిప్ లో కానీ ఇటు ఫ్లయిట్ లో కానీ కేరళ లోని కొచ్చి నుండి మాత్రమే వెళ్ళవలసి ఉంటుంది. దీంతో కొచ్చి లోనే క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేసి అక్కడ రెండు వారాల సమయం గడచిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేసి అప్పుడే లక్షదీవులలోకి అనుమతిస్తున్నారు. ఇప్పటి వరకు అక్కడ లోకల్ గా ఉన్న 61 మందికి టెస్ట్ లు చేయగా నెగటివ్ అని తేలింది. అంతే కాకుండా మిగిలిన దేశంలో ఎక్కడా కూడా విద్యా సంస్థలు తెరిచే ఆలోచన కూడా చేయలేని పరిస్థితుల్లో ఇటు లక్షద్వీప్ ప్రభుత్వం మాత్రం పాఠశాలలను తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరింది. ఫిబ్రవరిలో కరోనా అలజడి మొదలైనప్పుడే విదేశాల నుండి వచ్చే వారిని ముందుగా రెండు వరాల పాటు క్వారంటైన్ అనే రూల్ అమలు చేసి ఉంటే బహుశా మన దేశంలోనూ కరోనా ఇంత తీవ్రంగా ఉండేది కాదేమో అని సామాన్యులు అభిప్రాయ పడుతున్నారు. ఓ రకంగా మనది చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా తయారైంది పరిస్థితి.