English | Telugu
శ్రీవారు ఆయన ఆస్తుల్ని ఆయనే కాపాడుకుంటున్నారు
Updated : May 26, 2020
టీటీడీ కి చెందిన 50 ఆస్తులను విక్రయించాలని గత టీటీడీ పాలక మండలి 2016, జనవరి 30న తీసుకున్న నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం నిలిపివేసింది. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఆ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని ప్రస్తుత టీటీడీ పాలక మండలిని ఆదేశించింది. ఆ ఆస్తులను దేవాలయాల నిర్మాణం, ధర్మ ప్రచారం తదితర అవసరాలకు ఉపయోగించుకునే అంశంపై మత పెద్దలలతో చర్చించాలని సూచించింది. అంతవరకు ఆస్తులను విక్రయించే ప్రతిపాదనను నిలుపుదల చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
టీటీడీ ఆస్తుల విక్రయానికి బ్రేకులు పడటంతో శ్రీవారి భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్వామి వారు ఆయన ఆస్తుల్ని ఆయనే కాపాడుకున్నారని అంటున్నారు.