English | Telugu
గత ప్రభుత్వ హయాంలో మేనిఫెస్టో పేరుతో బుక్లు రిలీజ్ చేసేవారు
Updated : May 30, 2020
"కేవలం రెండు పేజీల్లోనే మేనిఫెస్టో పెట్టాం. ఇప్పటికే మేనిఫెస్టోలోని 90 శాతం హామీలను నెరవేర్చాం. సీఎం కార్యాలయం నుంచి ప్రతి అధికారి దగ్గరా మేనిఫెస్టోను ఉంచాం. మేం ఇచ్చిన 129 హామీల్లో ఇప్పటికే 77 అమలు చేశాం. అమలు కోసం మరో 36 హామీలు సిద్ధంగా ఉన్నాయి. మిగిలిన 16 హామీలను కూడా త్వరలోనే అమలు చేస్తాం. మేనిఫెస్టోలో లేని మరో 40 హామీలను కూడా అమలు చేశాం" అని సీఎం చెప్పుకొచ్చారు.
గత ప్రభుత్వ హయాంలో మేనిఫెస్టో పేరుతో బుక్లు రిలీజ్ చేసేవారని సీఎం ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం 600లకుపైగా హామీలిచ్చి, పది శాతం కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. జన్మభూమి కమిటీల నుంచి రాజధాని భూముల వరకు.. అన్నీ తమ కనుసన్నల్లోనే ఉండాలని గత ప్రభుత్వం కోరుకునేదని విమర్శించారు. ఆంగ్ల మాధ్యమాన్నీ అడ్డుకుంటున్నారు. ప్రభుత్వ భూమిని పేదలకు ఇస్తుంటే.. కోర్టుకెళ్లి అడ్డుకునే ప్రతిపక్షాన్ని ఇప్పుడే చూస్తున్నా అని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో పేదలకు పథకాలు దక్కాలంటే జన్మభూమి మాఫియాకు లంచాలు ఇవ్వాల్సిందే. కానీ, తమ ప్రభుత్వంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇంటికే వెళ్లి పథకాలు అందిస్తున్నాం అని సీఎం జగన్ పేర్కొన్నారు.