English | Telugu

ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దులు మూసివేత

ఏపీలో లాక్ డౌన్ చేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు . అమరావతి లో జరిగిన మీడియా కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ, ప్రజా రవాణా నిలిపివేస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. " నిత్యావసర వస్తువులు మినహా అన్ని షాపులు క్లొజ్ చెయ్యాలి.విదేశాల నుంచి వచ్చిన వారు తక్షణమే సమాచారం ఇవ్వాలి.దేశం మొత్తం కరోనపై యుద్ధం చేస్తుంది.ఏపీ అంతరాష్ట్ర సరిహద్దులు క్లోజ్ చేస్తున్నాం.గోడౌన్లు, ఫ్యాక్టరీలు కార్యాలయాలు పరిమిత సిబ్బందితో నడపాలి.ప్రజలు ఇళ్ళల్లోనే ఉండాలి," అంటూ ముఖ్యమంత్రి సూచించారు .అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు బయటకు రావాలి. విదేశాల నుంచి వచ్చి వారిని గుర్తించేందుకు పోలీసులు దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

రేషన్ ఫ్రీగా ఇవ్వడంతో పాటు ఒక కేజీ కందిపప్పు ఉచితంగా ఇస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి, ఏప్రిల్ 4వ తేదీన ₹1,000 విలువైన నిత్యావసర సరుకులు అందచేస్తామన్నారు. నిత్యవసర వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తే వారిపై కేసులు పెడతామని సి ఎం హెచ్చరించారు. రోజువారీ కార్మికులు జాగ్రత్తలు పాటించాలన్నారు.

అవసరాలను ఆసరాగా చేసుకుంటే క్రిమినల్ చర్యలు తప్పవున్నారు. తప్పని సరి పరిస్థితిలో అసెంబ్లీ సమావేశాలు పెట్టాల్సి వస్తోందని చెప్పిన సి ఎం, ఏపీలో ప్రస్తుతం కరోన అదుపులో ఉంది.14రోజుల పాటు పూర్తి లాక్ డౌన్ చేస్తున్నామని కూడా ముఖ్యమంత్రి ప్రకటించారు. వృద్ధులను,పిల్లలను బయటకు రాకుండా చూడాలని సి ఎం సూచించారు.