English | Telugu
పేదలకు 12 కిలోల బియ్యం 1500/- ఆర్థిక సాయం!
Updated : Mar 22, 2020
అత్యవసర సర్వీసులు తప్ప మిగిలిన ప్రభుత్వ ఉద్యోగులు ఆఫీసులకు రావాల్సిన అవసరం లేదన్నారు. 20 శాతం ఉద్యోగులు మాత్రమే రొటేషన్ పద్ధతిలో విధులకు హాజరవుతారని తెలిపారు. తెలంగాణలో ఆదివారం ఒక్కరోజే 5 వరకు పాజిటీవ్ కేసులు నమోదు కావడం ఆందోళన కల్గించిందని చెప్పారు.
ప్రైవేటు ఉద్యోగులకు ఈ సెలవుల కాలానికి కంపెనీలు వేతనాలు చెల్లించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాపించిన జిల్లాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని ఆయన చెప్పారు. తెలంగాణలోని 5 జిల్లాలు, హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కరోనా వైరస్ ప్రభావం ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించిందని సి.ఎం. తెలిపారు.
అంతర్జాతీయ పోర్టులు, అంతర్జాతీయ విమానాశ్రాయాలు ఈ రోజు నుంచి పూర్తిగా బంద్ అయ్యాయి. కాబట్టి విదేశాల నుంచి వారి భయం ఇక లేదు. ఇప్పటివరకు తెలంగాణాలో 26 పాజిటివ్ కేసులు నమోదయినట్టు సి.ఎం. తెలిపారు. అయితే వీరు విదేశీయులని పేర్కొన్నారు. దీంతో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈ రోజు ఏవిధంగా బాధ్యతాయుధంగా కర్ఫ్యూని పాటించారో.. మార్చి 31వ తేదీ వరకూ ఈ విధంగానే ఇంట్లో ఉండాలని కోరారు.