English | Telugu
25 వేల కోట్ల రుణాలు.. మూడు రాజధానుల పుణ్యమా రోడ్డున పడే పరిస్థితి!!
Updated : Dec 17, 2020
మూడు రాజధానుల నిర్ణయంతో ఏపీ భవిష్యత్ ప్రశ్నార్థంగా మారింది. వచ్చిన కంపెనీలు తరలి వెళ్లిపోతున్నాయి.. కొత్త పెట్టుబడులు రావట్లేదు. ఆదాయం లేదు.. అప్పులు పెరిగిపోతున్నాయి. దీంతో రాష్ట్ర పరిస్థితి ఏంటా అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా తమ రాష్ట్రం, తమ రాజధాని అన్న భావనతో వేల కోట్ల పెట్టుబడులు పెట్టి ఎందరికో ఉపాధి కల్పిద్దామని, రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకోవాలని భావించిన ఔత్సాహిక వ్యాపారవేత్తలు.. తమ జీవితాన్ని నరకంలో పడేసుకున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకోవాలన్న ఒకే ఒక్క కారణంతో ఎందరో తమ ఆస్తులను తనఖా పెట్టి మరీ పెట్టుబడులు పెట్టారు. ఆస్తులు తనఖా పెట్టి వివిధ బ్యాంకుల నుంచి దాదాపు 25 వేల కోట్లు రుణాలు తీసుకున్నారు. అయితే, మూడు రాజధానుల నిర్ణయంతో ఇప్పుడు అమరావతి భవిష్యత్ ప్రశ్నార్థంగా మారింది. నిర్మాణాలు ఆగిపోయాయి.. ఇప్పటికే సగం పెట్టుబడులు పెట్టి ఉండంతో.. వెనక్కి రాలేని, ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు బ్యాంకుల్లో తీసుకున్న రుణాల భారం పెరుగుతోంది. ఆ విధంగా రాజధాని, రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకోవాలనుకున్న ఔత్సాహిక వ్యాపారవేత్తలు.. ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం పుణ్యమా అని రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది.