English | Telugu

కార్పొరేటర్ల కొనుగోళ్ల కోసమే గ్రేటర్ మేయర్ ఎంపిక ఆలస్యం! 

సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పై తీవ్ర ఆరోపణలు చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. జీహెచ్ంసీ మేయర్ సీటు కోసం కుట్రలు చేస్తుందని మండిపడ్డారు. కార్పొరేటర్ల కొనుగోళ్ల కోసమే మేయర్ ఎంపికను అధికార పార్చీ ఆలస్యం చేస్తున్నారని సంజయ్ విమర్శించారు. తమ కార్పొరేటర్ల జోలికి వస్తే వంద మంది ఎమ్మెల్యేలను లాగుతామని హెచ్చరించారు. హైదరాబాద్ ఓల్ట్ సిటీ సంఘ విద్రోహ శక్తులకు అడ్డాగా మారిందని బండి సంజయ్ ఆరోపించారు. ఎంఐఎం, టీఆర్ఎస్ వియుక్త హైదరాబాద్‌ను సాధిస్తామన్నారు. పాతబస్తీ అభివృద్ధిపై కేసీఆర్‌ను ఒవైసీ ఎందుకు అడగడం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు.

చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారిని గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ కార్పొరేటర్లతో కలిసి బండి సంజయ్ దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అవినీతికి పాల్పడనని.. అభివృద్ధికి తోడ్పడుతానని బీజేపీ కార్పొరేటర్లతో ప్రమాణం చేయించారు సంజయ్. ఈ సందర్భంగా మట్లాడిన సంజయ్.. హైదరాబాద్ నగర అభివృద్ధికి బీజేపీ తప్పకుండా సహకరిస్తుందని చెప్పారు. కేంద్ర నుంచి నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు. కేసీఆర్ చేతగానితనం వల్లే హైదరాబాద్‌లో అభివృద్ధి ఆగిపోయిందన్నారు బండి సంజయ్.