English | Telugu
ఏ క్షణంలోనైనా మౌలానా సాద్ అరెస్టయ్యే అవకాశం
Updated : Apr 16, 2020
ఈ సదస్సు నిర్వహించిన తర్వాత దేశంలో కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. అంతేకాదు, సదస్సుకు హాజరైన వారిలో చాలామంది వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఒక్క ఘటన కారణంగా దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెద్ద సంఖ్యలో వెలుగుచూశాయి. నిజాముద్దీన్ పోలీస్ హౌస్ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు సాద్పై సెక్షన్ 304 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే, విదేశాల నుంచి ఈ కార్యక్రమానికి హాజరైన వారిపైనా వీసా నిబంధనల ఉల్లంఘన కింద కేసులు నమోదు చేశారు.