English | Telugu
ఏప్రిల్ 25 వరకు టీటీ డీ అన్నప్రసాదం పంపిణీ
Updated : Apr 18, 2020
లాక్డౌన్ వల్ల తిరుపతి, పరిసర ప్రాంతాల్లో భోజనానికి ఇబ్బంది పడుతున్న వలస కూలీలు, పేదల ఆకలి తీర్చడం కోసం టీటీడీ గత నెల 28వ తేదీ నుంచి అన్నప్రసాదం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. పశువులు కూడా మేత లేక ఇబ్బంది పడుతున్నందువల్ల ఏప్రిల్ 1వ తేదీ నుంచి గ్రాసం, దాణా, వీధి కుక్కలకు టీటీడీ ఆహారం అందిస్తోంది.